గాంధీనగర్లో వినాయకుడికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పూజలు
హైదరాబాద్, సెప్టెంబర్ 05, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని వివేక్నగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని శుక్రవారం కేంద్ర ప్రభుత్వ బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ బిజెపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్, ఆనంద్ రావు, సీనియర్ నాయకులు టి.గోపాల్, రమేష్ రామ్, సాయి, శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, శివ కుమార్, వాణి శాస్త్రి, సురేష్ రాజు, సాయి కుమార్, సత్యం, నీరజ్, రఘు, మండపం నిర్వాహకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply