హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : శ్రీరామనవమిలో భాగంగా పలు దేవాలయాల్లో సోమవారం శ్రీరాముడి పట్టాభిషేకం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీరాముడి పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, అర్చకులు బుగ్గ లక్ష్మీపతి శర్మ, ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
















Leave a Reply