ఘనంగా టిపిసిసి ప్రచార కమిటీ కో– కన్వీనర్
ఉప్పల శ్రీనివాస్ గుప్త బర్త్ డే వేడుకలు
– తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం శిబిరం

ఉప్పల శ్రీనివాస్ గుప్త బర్త్ డే సందర్భంగా రక్తదాన శిబిరం
హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ : టిపిసిసి ప్రచార కమిటీ కో– కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త బర్త్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాగోల్లోని ఉప్పల కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఐవిఎఫ్ హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్ కమిటీ, యువజన విభాగం సభ్యులందరూ పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్త సందర్శించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులకు ప్రశంసా పత్రాలను, అభినందన జ్ఞాపికలను అందచేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply