సాంప్రదాయ కళలను కాపాడుకోవాలి

సాంప్రదాయ కళలను కాపాడుకోవాలి

                                                 శ్రీనటరాజ కళా క్షేత్రం 25వ వార్షికోత్సవ వేడుకలు

సిటీ కల్చరల్, ఏప్రిల్ 26, ( అద్దం న్యూస్ ) :  సాంప్రదాయ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. శ్రీనటరాజ కళా క్షేత్రం 25వ వార్షికోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నటరాజ కళా క్షేత్రం గత 25 సంవత్సరాలుగా కళలు, కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సభకు ముందు చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు దాసరి, శ్రీ సాయి విద్యాలయ స్కూల్స్ వ్యవస్థాపకుడు కేఎస్ వెంకటేష్, నాట్యగురు వసుమతి వరకాల, చారిత్రిక పరిశోధకులు పి.మదన్ గుప్తా , సంస్థ అధ్యక్షురాలు పూర్ణిమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page