బీసీల బంద్ కు జంట నగరాల మహేందర మేదర సంఘం సంపూర్ణ మద్దతు   – జంట నగరాల మహేందర మేదర సంఘం అధ్యక్షుడు రేషం మల్లేష్

బీసీల బంద్ కు జంట నగరాల మహేందర మేదర సంఘం సంపూర్ణ మద్దతు

– జంట నగరాల మహేందర మేదర సంఘం అధ్యక్షుడు రేషం మల్లేష్

హైదరాబాద్, అక్టోబర్ 17, అద్దం న్యూస్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించ తలపెట్టిన బీసీల బంద్ కు జంట నగరాల మహేందర మేదర సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు రేషం మల్లేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం చిక్కడపల్లిలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీలు ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. శనివారం జరగనున్న బిసిల బంద్ లో జంట నగరాలకు చెందిన మహేందర మేదర సంఘం నాయకులు, మహేందర్లు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.


.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page