Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsఅఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ కార్యాలయంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ కార్యాలయంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

📰 Generate e-Paper Clip

అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ కార్యాలయంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

హైదరాబాద్, మార్చి 8, అద్దం న్యూస్ :   అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ( All India ST Employees Association ) జాతీయ కమిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్యక్రమానికి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్య‌క్షుడు పివి.రమణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు, హైద‌రాబాద్ జిల్లా అధ్య‌క్షుడు సతీష్ రాథోడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గోర్ల రమేష్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలుగు నాగార్జున, జాతీయ సంయుక్త కార్యదర్శి వై. శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్ కుమార్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, జాతీయ ఉపాధ్యక్షుడు రాజయ్య నాయక్, జాతీయ సంయుక్త కార్యదర్శులు శివ ప్రసాద్, నర్సింగరావు, ఇండ్ల శివశంకర్, జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సాకే గంపన్న, జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కృష్ణ నాయక్, జాతీయ కో–ఆర్డినేట‌ర్లు నాగార్జున‌, శివ శంక‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మహిళల సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వారు సాధించిన విజయాలను గుర్తిస్తూ, సంఘం తరఫున పలువురు ప్రతిభావంతులైన హైద‌రాబాద్ న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యం సంస్థ కార్య‌ద‌ర్శి పొట్లూరి పద్మజ, ఇన్‌స్పెక్ట‌ర్ ఎం.రాధా, ఎస్‌పిఆర్ రియాల్టీ చైర్మ‌న్ పూజా రాథోడ్, ప్ర‌ధాన అధ్యాప‌కురాలు వీరలక్ష్మి, ధనలక్ష్మి కంపెనీస్ ప్రొప్రైటర్ ధనలక్ష్మి, బ్యాంకు మేనేజర్ విజయలక్ష్మి ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పివి.రమణ మాట్లాడుతూ… మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. మహిళా సాధికారత కోసం సంఘం ఎప్పటికీ తమ వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page