హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ : ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి బ్రహ్మకుమారీస్ శాఖలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని బ్రహ్మకుమారీస్ జయశ్రీ, ప్రసాద్, వైశాలి లు తెలిపారు. ఈ యోగా దినోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్కు ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, బ్రహ్మకుమారీస్ జయశ్రీ, ప్రసాద్, వైశాలి లు మాట్లాడుతూ… పెద్ద సంఖ్యలో యోగాలో పాల్గొని శారీరక మానసిక ఆరోగ్యం మెరుగు పరుచుకోవాలని కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply