...

మీ పిల్లల్ని చదివించేందుకు ఫాలో అవ్వాల్సిన 6 టెక్నిక్స్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పిల్లలను చదివించడం అనేది చాలా పెద్ద టాస్క్. రోజూ హోమ్ వర్క్ చేయించే సరికి తలప్రాణం తోకకు వస్తుంది. కొన్ని సార్లు ఇంట్రెస్ట్ గా చేస్తారు. మరి కొన్ని సార్లు ఇబ్బంది పెడతారు. అయితే..ఎప్పుడైనా సరే వాళ్లలో ఆసక్తి పెంచి ఆ తరవాతే చదివించాలి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వాళ్లలో చదువుపైన ఫోకస్ పెరగడంతో పాటు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మరి ఏ చిట్కాలు పాటిస్తే వాళ్లలో ఆసక్తి పెరుగుతుందో వివరంగా తెలుసుకోండి.

బలవంతం వద్దు

​పిల్లలకు నేర్పించడం అంత సింపుల్ కాదు. వాళ్ల విధానంలోకి వెళ్లి మరీ నేర్పించాల్సి ఉంటుంది. గట్టిగా అరిచినా, కోప్పడినా వాళ్లు చదువుపై ఫోకస్ పెట్టరు. ముఖ్యంగా చదివే విషయంలో పూర్తిగా వాళ్లకి స్వేచ్ఛను ఇవ్వాలి. ఏ టైమ్ లో చదవాలని అనుకుంటున్నారో అప్పుడే వాళ్లని చదివించాలి. అంటే..మరీ అర్ధరాత్రి వరకూ కాకుండా వాళ్లు చెప్పిన టైమ్ ని బట్టి కాస్త అటూ ఇటూ అడ్జస్ట్ మెంట్స్ చేస్తూ వాళ్లకి అర్థమయ్యే విధంగానే చెబుతూ నేర్పించాలి. స్నాక్స్ టైమ్ ఉంటే..అంతకు ముందు చేస్తారా..లేదంటే తరవాత చేస్తారా అని ముందుగానే ప్రశ్నించాలి. ఈ ఛాయిస్ వాళ్లకే ఇవ్వాలి. వాళ్లు చెప్పిన ఆన్సర్ ని బట్టి డిసైడ్ అవ్వాలి. అంతే కాని బలవంతంగా వాళ్లపై ఏమీ రుద్దకూడదు.

ఆటపాటలుగా

చదివించడం అంటే సీరియస్ గా కూర్చోబెట్టి అన్నీ చెప్పాలి అని కాదు. కాస్త ఆటగోలుగానే ఉండాలి. అంటే.. కష్టమైన టాపిక్స్ ని గేమ్స్ లా మార్చి వాళ్లకి అర్థమయ్యే విధంగా నేర్పించాలి. పజిల్స్ సాల్వ్ చేయించడం, మైండ్ గేమ్స్ ఆడించడం లాంటివి చేయాలి. వీటి వల్ల పిల్లల్లో నేర్చుకునే గుణం పెరుగుతుంది. నేర్చుకోవడాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తారు. మొదట 20 నిముషాల పాటు చదివేలా ఓ ఛాలెంజ్ పెట్టాలి. ఈ 20 నిముషాల పాటు సరైన విధంగా చేస్తే ఓ లెవెల్ సాధించినట్టుగా..అంటే గేమ్ లో ఎలాగైతే లెవెల్ సాధిస్తే రివార్డ్స్ వస్తాయో అలా వాళ్లను ప్రోత్సహించాలి. దీని వల్ల పిల్లలు స్క్రీన్ టైమ్ తగ్గించి కొత్తవి నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు

పొగడడం ముఖ్యం

పిల్లలు నేర్చుకున్నది చిన్న విషయమైనా సరే ప్రశంసించాలి. వాళ్ల మైండ్ సెట్ కి ఆధారంగానే నేర్పించడం మొదలు పెట్టాలి. అదనపు భారం వాళ్లపైన వేయకూడదు. అలా అయితేనే వాళ్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఏం నేర్చుకున్నా సరే..స్మార్ట్ అంటూ పిల్లల్ని పొగడాలి. ఇలా చేయడం వల్ల వాళ్లలో పాజిటివిటీ పెరుగుతుంది. ఏమైనా చేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. క్రమంగా ఇంటిలిజెన్స్ పెరుగుతుంది. కష్టపడి హోమ్ వర్క్ పూర్తి చేస్తే ఆ కష్టాన్ని ప్రశంసించండి. దీని వల్ల వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

క్యూరియాసిటీ పెంచండి

పిల్లల్లో ఆసక్తి పెంచడం అనేది తల్లిదండ్రులు చేయాల్సిన మొదటి పని. వాళ్ల బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలంటే మొట్టమొదట వాళ్లలో క్యూరియాసిటీ పెంచాలి. పుస్తకాలు తెరిచే ముందే ఆ క్యూరియాసిటీ పెరగాలి. పుస్తకం తెరిచే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. అవి సబ్జెక్ట్ తో సంబంధం ఉన్నవే అవ్వాల్సిన అవసరం లేదు. వేరేవి అయినా సరే జస్ట్ వాళ్లలో ఆసక్తి పెంచే ప్రశ్నలు అడిగితే సరిపోతుంది. దీని వల్ల కొత్తవి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్లలో పెరుగుతుంది.

ఇలా సెట్ చేయండి

పిల్లల్ని చదివించడం అంటే సాధారణ విషయం ఏమీ కాదు. పిల్లల కన్నా ముందు తల్లిదండ్రులు ప్రిపేర్ అవ్వాలి. అయితే వాళ్లను చదివించే వాతావరణం బాగుండాలి. రోజూ ఓ టేబుల్ పైన కూర్చోబెట్టి వాళ్లకి నచ్చిన బొమ్మలు, లేదా వస్తువులు అక్కడ ఉంచాలి. రోజూ ఒకే టైమ్ లో చదివించే విధంగా ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఆ టైమ్ కి వాళ్లు అలవాటుపడిపోతారు. వాళ్లకి నచ్చిన ఫుడ్ లేదా డ్రింక్ ఇవ్వాలి. ఆ తరవాత వాళ్లను చదివించేందుకు సిద్ధం చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు కూడా మానసికంగా సిద్ధంగా ఉంటారు.

మోటివేట్ చేయడం ముఖ్యం

చిన్న చిన్న లక్ష్యాలు సాధించినా సరే వాళ్లని ప్రోత్సహించండి. ఇలా మోటివేట్ చేయడం వల్ల పిల్లల్లో పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి. అదే సమయంలో ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు ధైర్యం వస్తుంది. వాళ్లలో క్రమంగా ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఏదైనా ఛాప్టర్ కంప్లీట్ చేసినప్పుడు అక్కడ కలర్స్ తో మార్క్ చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్లలో ఫోకస్ పెరుగుతుంది. ఆ స్టికర్స్ చూసినప్పుడు టాపిక్స్ కూడా రివైజ్ చేసినట్టుగా అవుతుంది. పైగా అది వాళ్ల అఛీవ్ మెంట్ కి సంకేతంగానూ ఉంటుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.