విఎస్టి పార్కులో ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరం
హైదరాబాద్, జూలై 4, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లి డివిజన్ విఎస్టి పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరం జరిగింది. పద్మావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో డయాబెటిక్ తో ఉన్న వాకర్లకు ఉచితంగా వైద్యాన్ని అందచేసి, మందులను అందచేశారు. ఈ సందర్భంగా విఎస్టి పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుత రోజుల్లో చాలా మంది డయాబెటిక్తో ఇబ్బందులుపడుతున్నారన్నారు. వారి కోసమే ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్కు సభ్యులు మురళీధరుడు, జైహింద్, సాయి, అనిల్, మధుకర్, కోటేశ్వరరావు, ఆంజనేయులు, నర్సింగరావు, వెంకట్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply