హైదరాబాద్, అద్దం న్యూస్ : నటి విష్ణుప్రియకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్ లు క్వాష్ చేయాలని హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ వేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని క్వాష్ పిటిషన్ను కొట్టేసి, స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. విష్ణుప్రియతో పాటు యాంకర్ శ్యామల, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply