గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం
మేడ్చల్ జిల్లా మహిళా విభాగం ప్రధాన
కార్య దర్శిగా భీమగొని రజనీ గౌడ్
హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ : గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం మేడ్చల్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్య దర్శిగా భీమగొని రజనీ గౌడ్ నియమితులయ్యారు. గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జాతీయ అధ్యక్షుడు నక్క కృష్ణ గౌడ్ ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నక్క మహేందర్ గౌడ్, కార్యదర్శి కొన్నే సతీష్ గౌడ్, మహిళా జాతీయ అధ్యక్షురాలు లక్ష్మి శైలజాగౌడ్ సూచనతో భీమగొని రజనీ గౌడ్ను మేడ్చల్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ గురువారం నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా భీమగొని రజిని గౌడ్ మాట్లాడుతూ… గౌడ్ కుల హక్కుల సాధనలో భాగంగా జరిగే ఏ పోరాటమైన అందులో ముందుంటానన్నారు. ఈ కార్యకమంలో తెలంగాణ మహిళా అధ్యకురాలు కొన్నే మాధవి గౌడ్, ప్రచార కమిటీ అధ్యక్షురాలు వేముల పుష్పలత గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యం బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply