తెలంగాణలో బిజెపి జెండా ఎగరడం ఖాయం
- రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ అన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు పాశం సాయికృష్ణయాదవ్ ఆధ్వర్యంలో అంగన్వాడి పిల్లలకు స్లేట్, బల్పం బాక్స్, వాటర్ బాటిళ్లతో కూడి స్కూల్ బ్యాగ్స్ కిట్లను ఉచితంగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై డివిజన్ అధ్యక్షుడు పాశం సాయికృష్ణ యాదవ్తో కలిసి అంగన్వాడి పిల్లలకు బ్యాగ్ కిట్లను అందచేశారు. అంతకుముందు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్.లక్ష్మణ్ మాట్లాడుతూ… బిజెపితోనే సామాన్యుడికి న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన పార్టీ బిజెపి అని అన్నారు. తెలంగాణలో సైతం బిజెపి జెండా ఎగురబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్గౌడ్, బిజెపి నాయకులు కౌండిన్య ప్రసాద్, శేషసాయి, విన్ను ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 













Leave a Reply