Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై భార‌త సైనికుల దాడి పై సంబురాలు

ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై భార‌త సైనికుల దాడి పై సంబురాలు

📰 Generate e-Paper Clip

 

 

ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై భార‌త సైనికుల దాడి పై సంబురాలు

 

జాతీయ జెండాల‌తో క‌లిసి ర్యాలీని నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌
                            జాతీయ జెండాల‌తో క‌లిసి ర్యాలీని నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ :    కాశ్మీర్ లోనీ పహాల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలకు అమరులైన భారతీయుల మరణాలకు ప్రతీకగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైనిక బలగాలు మంగళవారం అర్థరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ లోని 9 ఉగ్రమూకల స్థావరాలపై బాంబుల దాడితో విరుచుకు పడి సుమారు 100 కు పైగా లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేప‌ధ్యంలో ముషీరాబాద్ భార‌త సైనికులకు మ‌ద్ద‌తుగా, వారి దాడుల‌ను స్వాగ‌తిస్తూ బుధ‌వారం సంబురాలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాల‌తో ర్యాలీని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై జాతీయ జెండాల‌ను ప‌ట్టుకుని జైహింద్ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే పోయే వారికి స్వీట్లు తినిపించారు. ఈ సంద‌ర్భంగా కాశ్మీర్ లోనీ పహాల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలకు అమరులైన భారతీయుల మరణాలకు ప్రతీకగా ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర‌వాదుల‌ను అంత‌మోందించడంలో భార‌త సైన్యానికి రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు జావీద్ ఖాన్‌, మోయిన్‌, మునావ‌ర్‌చాంద్‌, దీన్‌ద‌యాల్‌రెడ్డి, ప‌రుశురామ్ యాద‌వ్, శ్రీశైలం యాద‌వ్‌, క్రాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page