బిజెవైఎం యువ నాయకుడు బండారి సిద్ధార్థ్ సంతాప సభ
ముషీరాబాద్, మే 16, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్కు చెందిన బిజెపి ఓబిసి మోర్చ సీనియర్ నాయకుడు బండారి భరత్ కొడుకు బండారి సిద్ధార్థ్ ఇటీవల ఆర్టిసి క్రాస్ రోడ్లోని స్టీల్ బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం వారి నివాసం వద్ద బండారి సిద్ధార్థ్ దశదిన కర్మ, సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై సిద్ధార్థ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బిజెవైఎం, బిజెపి పార్టీ కార్యక్రమాల్లో సిద్ధార్థ్ చురుగ్గా పాల్గొనేవాడని వినయ్ కుమార్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం డివిజన్ అధ్యక్షుడు టి.జ్ఞానేశ్వర్, బిజెపి నేతలు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply