బిఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలని కాంగ్రెస్ నీచమైన కుట్ర
– ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్
హైదరాబాద్, జనవరి 31, అద్దం న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన కుట్ర చేస్తుందని ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కేసిఆర్ కు సిట్ నోటీసులతో సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎంత దిగజారిందో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికి వదిలేసి కెసిఆర్ను సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. అసలు విషయమే లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏకంగా ఉద్యమ నేతకే నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు.![]()














Leave a Reply