నిఖిత తల్లిదండ్రులను పరామర్శించిన ఈస్ట్ జోన్ డీసీపీ

నిఖిత తల్లిదండ్రులను పరామర్శించిన ఈస్ట్ జోన్ డీసీపీ

సికింద్రాబాద్, జ‌న‌వ‌రి 7, అద్దం న్యూస్ :   అమెరికాలో ఇటీవల మృతి చెందిన నిఖిత కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీ న‌ర్స‌య్య‌  తార్నాకలోని విజయ్ పూరి కాలనీలో నివాసం ఉంటున్న నిఖిత తల్లిదండ్రుల నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా నిఖిత తల్లిదండ్రులతో మాట్లాడిన పోలీసు అధికారులు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్ట సమయంలో హైదరాబాద్ పోలీసులు పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. నిఖిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page