మాజీ కార్పొరేటర్ పావని కి ఘనంగా సన్మానం
హైదరాబాద్, ఫిబ్రవరి 11, అద్దం న్యూస్ : అధికారికంగా 5 ఏళ్ల కార్పొరేటర్ బాధ్యతలను సంపూర్ణంగా పూర్తి చేసుకున్న ఎ.పావని కి గాంధీనగర్లోని ఆమె కార్యాలయం వద్ద బుధవారం డివిజన్ బిజెపి సీనియర్ నాయకులతో కలిసి సన్మానించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోనే గాంధీనగర్ డివిజన్ను అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలిపి, ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మాజీ కార్పొరేటర్కు బిజెపి పార్టీ తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్రావు, నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, సురేష్, రాజు, శ్రీనివాస్ యాదవ్, సాయి కుమార్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply