సిజిఓ ట‌వ‌ర్స్ పై నుంచి దూకి ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారిణి ఆత్మ‌హ‌త్య‌

 

హైదరాబాద్ క్రైమ్‌, అద్దం న్యూస్ :  ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారిణి క‌వాడిగూడ‌లోని సిజిఓ ట‌వ‌ర్స్‌ భ‌వ‌నం 8వ అంత‌స్తు పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ డి.రాజు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.. మ‌ల్కాజిగిరి ఈసిఎల్‌ సాయినాథ‌పురం కు చెందిన జ‌య‌ల‌క్ష్మీ కవాడిగూడలోని సిజివో టవర్స్‌లో రెండున్నర సంవత్సరాలుగా ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారిణిగా విధుల‌ను ప‌ని చేస్తోంది. త‌న‌కు 22 ఏళ్ల భావ‌న ర‌మేష్ కూతురు ఉంది. త‌న భ‌ర్త సిఎన్‌.ర‌మేష్‌తో 9 ఏళ్ల క్రితం జ‌య‌ల‌క్ష్మీ విడాకులు తీసుకుని కూతురుతో విడిగా ఉంటుంది. ఇదిలా ఉండ‌గా గత రెండు సంవత్సరాలుగా జ‌య‌ల‌క్ష్మీ ఆమె రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటుంది. ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉందని తెలిసినప్పటి నుండి జ‌య‌ల‌క్ష్మీ తీవ్ర నిరాశ‌తో ఉంటుంది. ఇదిలా ఉండ‌గా ఎప్పటిలాగే శ‌నివారం ఉదయం 09:30 గంటలకు భావ‌న త‌న సిఎ ఇంటర్న్‌షిప్ కోసం, బాబు జగ్జీవన్ రామ్ జయంతి దృష్ట్యా బేగంపేటకు వెళ్లింది. కాబట్టి ఆమె తల్లికి ఈరోజు ఆఫీసు లేదు. త‌ర్వాత‌ క‌వాడిగూడ‌లోని సిజివో ట‌వ‌ర్స్‌కు వ‌చ్చిన జ‌య‌ల‌క్ష్మీ భ‌వ‌నం 8వ అంత‌స్తు పై నుంచి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని స‌మాచారం తెలుసుకున్న గాంధీన‌గ‌ర్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. వెంట‌నే విష‌యాన్ని భావ‌నకు పోలీసులు స‌మాచారాన్ని తెలియ‌చేశారు. జ‌య‌లక్ష్మీ త‌ల‌కు తీవ్ర గాయ‌మై ర‌క్త‌స్రావం కావ‌డంతో ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆమెను ప‌రీక్షించిన వైద్యులు ఆమె చ‌నిపోయిందని తెలియ‌చేశారు. రొమ్ము క్యాన్స‌ర్ ఉంద‌ని నిరాశ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని మృతురాలి కూతురు భావ‌న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page