సికింద్రాబాద్, జులై 18, అద్దం న్యూస్ : చారిత్రాత్మక చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాలు వేడుకలు సాంప్రదాయబద్దంగా, ఏ ఇబ్బందులు లేకుండా నిర్వర్తించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. చిలకలగూడా కట్ట మైసమ్మ దేవాలయం ఉత్సవ కమిటి ఛైర్మన్ గుంటి కృష్ణ, ఆలయం కార్యనిర్వహణాధికారి మహేందర్ గౌడ్ ల నేతృత్వంలోని బృందం మోండా మార్కెట్ టకార బస్తీలోని పద్మారావు గౌడ్ నివాసాన్నిశుక్రవారం సందర్శించి ఆహ్వాన పత్రికను అందించింది. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తీరుగానే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు.
Leave a Reply