నగర కేంద్ర గ్రంథాలయంలో జయశంకర్ సార్ జయంతి
హైదరాబాద్, ఆగస్టు 06, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థలో దివంగత ప్రొఫెసర్, తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ పాల్గోని జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిటీ సెంట్రల్ లైబ్రరి ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు సుబ్బలక్ష్మీ, ద్వితీయ శ్రేణి గ్రంథ పాలకురాలు సీతామహాలక్ష్మీ, సీనియర్ అసిస్టెంట్ అవినాష్, సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply