గాంధీనగర్లో జయశంకర్ జయంతి
హైదరాబాద్, ఆగస్టు 06, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత జయశంకర్ జయంతి కార్యక్రమం బుధవారం జరిగింది. గాంధీనగర్ డివిజన్ ప్రధాన రోడ్డు మార్గంలో గల జయశంకర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ మారిశెట్టి నర్సింగ్రావు హాజరై పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్, బాబ్జి, జయేందర్ బాబు, హఫీజ్, బాబురావు, సురేష్, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

