బిఆర్ఎస్ పార్టీ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణి
హైదరాబాద్, జనవరి 14, అద్దం న్యూస్ : సంక్రాంతి పండుగ నేపధ్యంలో ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులకు ఉచితంగా పతంగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై చిన్నారులకు పతంగులను ఉచితంగా అందచేశారు. పతంగులను ఎగురవేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చైనా మాంజాను వాడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, నాయకులు పట్నం నరేష్ ముదిరాజ్, సత్యనారాయణ బాబు, అశోక్, సతీష్, శంకరయ్య గౌడ్, సాయి, శ్రీనివాస్ యాదవ్, సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ![]()

![]()












Leave a Reply