ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
హైదరాబాద్, సెప్టెంబర్ 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం శనివారం ఆర్టీసి క్రాస్ రోడ్లో జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు అతినగరం సుదేష్ కుమార్ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం నాయకులు హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు మంథన దశరథ్, బొమ్మల సతీష్, సోమ సతీష్, బొడ్డు తిరుపతి, బోనం ఊర్మిళ, రాచపాళీ శంకరయ్య, మణిపాల్, శంకరరావు, నరేందర్, శ్రీనివాస్, ఎయిర్టెల్ రాజు, ప్రభాకర్, బిజ్జ శ్రీకాంత్, మార్గం అమర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply