Home Hyderabad విద్యుత్ షాక్ కొట్టి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ కొట్టి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి మృతి

0
20

 

చాంద్రాయణ గుట్ట, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ :   చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విద్యుత్ వైరు తగిలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముకేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. బ్రతుకు దెరువు కోసం వలస వచ్చి మార్బుల్ పాలిష్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం న‌గ‌రంలో ఈదురు గాలిలతో కురిసిన వర్షానికి. చెట్టు కొమ్మలు విరిగి కరెంటు తీగ తెగి వర్షం నీళ్లలో పడడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. తన స్నేహితునితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఈ ఘటన సంభవించింది. మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతనికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. మైలార్‌దేవులప‌ల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతిని కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page