అద్దం న్యూస్, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలోని మలక్పేట ప్రాంతంలో భారీ చోరీ కలకలం సృష్టించింది. ఆఫీసర్స్ కాలనీలోని ఒక ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించి, భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఇంట్లో సుమారు రూ. 50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు ఉన్నట్లు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు పక్కా ప్రణాళికతో ఇంట్లో చొరబడి ఈ విలువైన వస్తువులను అపహరించారు.
నేపాలీ ముఠాపై అనుమానం..
ఈ భారీ చోరీ వెనుక నేపాలీ ముఠా హస్తం ఉందని ఇంటి యజమాని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడిన ముఠాల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply