బాబూ జాగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
హైదరాబాద్, జులై 7 అద్దం న్యూస్ : భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జాగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం రాంనగర్ హరినగర్లో జరిగింది. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేవైఎం ముషీరాబాద్ కన్వీనర్ గడ్డం నవీన్ హాజరై జాగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్, దళిత సంఘాల నాయకులు గండి కృష్ణ, నందగిరి నర్సింహా, తాండ్ర మురళి, గజ్జెల రాజశేఖర్, విజయకృష్ణ, లాల్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply