గాంధీనగర్లో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి

హైదరాబాద్, అక్టోబర్ 25, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి వివేక్నగర్ పీపుల్స్ పార్క్లో గల శ్రీ శ్రీ శ్రీ నాగ దేవత, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగుల చవిత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ నాగుల చవితి పూజలకు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేత పి.నర్సింగ్ రావు, ఆలయ పూజారి శ్రీనివాస్, జ్యోతి, చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply