హనుమాన్ శోభాయాత్రకు స్వాగతం పలికిన పీస్ కమిటీ సభ్యులు
హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ : హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కర్మాన్ఘాట్ నుంచి తాడ్బండ్ వరకు గురువారం భారీ శోభాయాత్ర జరిగింది. సికింద్రాబాద్ జోన్ డిసిపి రక్షిత కృష్ణమూర్తి ఆదేశాల మేరకు పీస్ కమిటీ సికింద్రాబాద్ మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, ఖైరతాబాద్ పీస్ కమిటీ అధ్యక్షుడు శశికాంత్ అగర్వాల్, సభ్యులు మహ్మద్ అలీ, మహ్మద్ ఖదీర్, విశ్వనాథ శాస్త్రి, అర్ఫత్, జమాల్, మూస, ఖాదర్, జమాలుద్ధీన్, ఖాలెద్, నిజామ్, దస్తగిర్ తదితరులు హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద శోభాయాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు వెళ్లిన భజరంగ్ దళ్ కార్యకర్తలను పీస్ కమిటీ సభ్యులు సన్మానించారు.![]()

![]()












Leave a Reply