యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న
సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి దేవి వర ప్రసాద్
హైదరాబాద్, ఏప్రిల్ 18, అద్దం న్యూస్ : ఇండో–అమెరికా ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ భాను, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్, ప్రీతం, డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి, ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోర్డ్ మెంబర్ గుండెల్లి దేవి వర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను ను కలిసిన డీసీసీ సెక్రటరీ గుండెల్లి దేవి వర ప్రసాద్ మద్దతును ప్రకటించారు.![]()

![]()













Leave a Reply