శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో వైభ‌వంగా సీతారాముల క‌ళ్యాణం

 

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో వైభ‌వంగా సీతారాముల క‌ళ్యాణం

హైదరాబాద్, అద్దం న్యూస్ :    శ్రీ రామ‌నవ‌మి సంద‌ర్భంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ఆదివారం శ్రీ సీతారాముల క‌ళ్యాణం ఘ‌నంగా జ‌రిగింది. ఈ క‌ళ్యాణానికి ముఖ్య అతిథులుగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్‌, బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వేద‌మంత్రాల మ‌ధ్య సీతారాముల క‌ళ్యాణం క‌నుల‌విందుగా జ‌రిగింది. ఈ క‌ళ్యాణాన్ని చూసేందుకు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మ‌హేష్‌, సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.Sita Rama's marriage ceremony held in grandeur at Sri Bhavani Shankara Temple

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page