
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : మహారాష్ట్రలోని శని శింగనాపూర్లో ఉన్న ఈ ఆలయం శని దేవుని కి టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ… ఆ స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఇక్కడి దైవము స్వయంభు అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని, గంభీరమైన రాతి విగ్రహం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఉప్పల స్వప్న, కుమారుడు ఉప్పల సాయి కిరణ్, కోడలు శర్వరీ, చిన్న కుమారుడు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply