శ్రీ రేణుకా ఎల్లమ్మ.. శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన – ఆలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 6, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్‌ సబర్మతినగర్ బస్తీలో పునర్నిర్మాణం జరుపుకున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ.. శ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఆలయ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ముఖ్య అతిథులను ఆహ్వానించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, ధనరాజ్, ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, ప్రశాంత్, నర్సింగ్ రావు, లక్ష్మణ్, నర్సింగ్, జగన్, డి.కుమార్, జివై.గిరి, చందు, సంధ్యా తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page