ఉద్యమకారుడు సిరిగిరి శ్యామ్ ఆధ్వర్యంలో
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 
హైదరాబాద్, జూన్ 2, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ఉద్యమకారుడు, ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సిరిగిరి శ్యామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిహెచ్ఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వందలాది మంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమంతో అప్పటి కేంద్రం దిగి వచ్చి రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వ గోపి, రాకం సత్యనారాయణ, వెంకటేష్, అమిత్ రావు, అరుణ్, విక్కి అరవింద్, రమేష్, జుగేందర్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply