అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న వినయ్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 30, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రి వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో వాడ వాడల్లో కొనసాగుతున్నాయి. గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పలు అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply