వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
హైదరాబాద్, మార్చి 23, అర్థం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని వివేక్నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేఖ, ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్ ల పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 1,88,444 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు పద్మావతి, నిర్మల, శ్యామ్ ముదిరాజ్, అర్చకులు బుగ్గ లక్ష్మీపతి శర్మ, వేంకటాద్రి, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply