...

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం
హుండీ లెక్కింపు

హైద‌రాబాద్‌, జూన్ 22, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం సోమ‌వారం జ‌రిగింది. ఆల‌య ఈవో కొమ్మాల్‌, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ సురేఖ ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భ‌క్తులు, ఆల‌య సిబ్బంది హుండీని లెక్కించారు. 45 రోజుల‌కు సంబంధించిన ఈ హుండీ లెక్కింపులో హుండీ ఆదాయం ల‌క్ష 92 వేల 982 రూపాయ‌లు రాగా, 36 వేల 491 రూపాయ‌ల ఈ హుండీతో క‌లిపి 2 ల‌క్ష‌ల 29 వేల 473 రూపాయ‌లు వ‌చ్చింద‌ని ఆల‌య ఈవో కొమ్మాల్‌, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ సురేఖ లు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.