వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
హైదరాబాద్, ఆగస్టు 11, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేఖ ల పర్యవేక్షణలో ఆలయ రెనోవేషన్ కమిటీ ధర్మకర్తలు శ్యామ్ ముదిరాజ్, అర్చకులు బుగ్గ లక్ష్మీపతి శర్మ, సిబ్బంది, భక్తులు హాజరై హుండీని లెక్కించారు. ఈ హుండీ లెక్కింపులో 2 లక్షల వెయ్యి 624 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో దేవనాథం తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply