గాంధీనగర్ గణేష్ మండపాల్లో పూజలు
ముషీరాబాద్, సెప్టెంబర్ 02, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో గణేష్ మండపాల్లో వినాయకుడు పూజలందుకుంటున్నాడు. గాంధీనగర్ డివిజన్లో ఐబి ఫ్లాట్స్, అరుంధతి నగర్ బస్తీ, వివి.గిరి నగర్, అన్నానగర్ బస్తీతో పాటు చిక్కడపల్లిలోని పలు గణేష్ మండపాలను నిర్వాహకుల ఆహ్వానం మేరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో బీజేపీ నేతలు ఎం.ఉమేష్, ఆనంద్ రావు, సాయి కుమార్, నీరజ్, సత్యేందర్, సురేష్, సంధ్యారాణి, ఆశిష్, మండపం నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply