హైదరాబాద్, అద్దం న్యూస్ : హక్కుల కోసం మహిళందరూ ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోళ్ల సంగమేశ్వర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర్య శ్రావణి మాశెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళలు తలచుకుంటే జరగని పని అంటూ ఏదీ లేదన్నారు. మహిళలు సామాజిక స్ఫూర్తితో ముందడుగు వేస్తే యావత్ సమాజం మొత్తం వారి వెంటే ఉంటుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్న ఈ సమాజంలో నేటికీ మహిళలపై అనేక దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని వాటిని అరికట్టాలంటే నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరారు. ఐక్యమత్యంగా ఉండి ఆర్థిక రాజకీయ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో దూసుకుపోవాలన్నారు. మహిళలు వంటింటి కుందేలుగా ఉండొద్దని.. పోరాడే సింహాలుగా ఉండాలని అప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.














Leave a Reply