హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కెనరా బ్యాంక్ సర్కిల్ వద్ద బూత్ నెంబర్: 36లో జెండావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్తో కలిసి బీజేపీ పార్టీ జెండాను లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భారత్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, బూత్ అధ్యక్షులు బాలస్వామి, బీజేపీ సీనియర్శ్రీ నాయకులు కాంత్, రాజు, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, ఆకుల సురేందర్, మహమూద్, లక్ష్మణ్ యాదవ్, నర్సింహ, దొనేటి సత్యం, ఆనంద్ రావు, లక్ష్మి నారాయణ, అరుణ్ కుమార్, నీరజ్, ప్రశాంత్, రాజ్కుమార్, సంధ్యా రాణి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. 













Leave a Reply