అంగన్వాడి, ఆశావర్కర్లు, జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకలను అందచేసిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : దసరా పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తన కార్యాలయం వద్ద అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు, ఆశా వర్కర్లకు, జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు, ఎస్ఎఫ్ఏ లకు దసరా కానుకలను అందచేశారు. మహిళలకు చీరలను, పురుషులకు దుస్తువులను అందచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, శివ కుమార్, లక్ష్మణ్ యాదవ్, డి.కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply