Saturday, September 19, 2026
No menu items!
HomeCrime Newsఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే..

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే..

📰 Generate e-Paper Clip

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కర్ణాటకలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రైవేట్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బెంగళూరు నుండి గోకర్ణకు బయలుదేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీ వేగంగా బస్సును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో 13 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

మిగిలిన ప్రయాణికులలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రయాణాల్లో అజాగ్రత్త, అతివేగం ఇలాంటి ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం లేదా వాహనాల ఫిట్‌నెస్ సరిగా లేకపోవడం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page