బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో
రెయిన్బో హోంలో బాలికలకు అన్నదానం
హైదరాబాద్, అక్టోబర్ 20, అద్దం న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్రెడ్డి కుమారుడు కొండా వేదాంత్రెడ్డి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల రెయిన్ బో హోంలో బాలికలకు శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హాజరై వేదాంత్రెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలికలకు భోజనాన్ని వడ్డించారు. బాలికలతో కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి, పులిగిల్ల శ్రీధర్ చారి, జావీద్ ఖాన్, భాషపాక శ్రీనివాస్, గంటల రాజు, భాస్కర్, సత్యనారాయణ బాబు, మోయిన్, టిల్లు, శ్రీకాంత్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply