ఈ నెల 16 నుండి హైదరాబాద్ రీజియన్ పరిధిలో కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం
– టిజిఎస్ ఆర్టీసీ చార్మినార్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బాబు నాయక్
హైదరాబాద్, జనవరి 1, అద్దం న్యూస్ : ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు కొత్తగా ఈ నెల 16 నుండి 213 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు టిజిఎస్ ఆర్టీసీ చార్మినార్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బాబు నాయక్ తెలిపారు. అదే విధంగా 02.01.2026 నుండి ముషీరాబాద్ డిపో 45 ఎఫ్ రూట్ లో బస్సులు నడుపుటకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 45 ఎఫ్ రూట్ లో ( కోఠి – చిక్కడపల్లి- ముపీరాబాద్- పారడైస్ -బేగంపేట్- అమీర్ పేట్-ఎర్రగడ్డ -బోరబండ ) తదితర ప్రాంతాలు ఉంటాయన్నారు. ఈ కొత్త సేవలను అనువైన సమయాల్లో అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగుదలలు చేపట్టేందుకు కూడా హైదరాబాద్ రీజియన్ సిద్ధంగా ఉందని తెలిపారు.
సమయాలు :
కోఠి నుండి : 6:05, 7:05, 8:25, 9:25, 10:55, 11:55, 13:55, 14:55, 16:10, 17:10, 18:40, 19:40
బోరబండ : 7:15, 8:15, 9:45, 10:45, 12:05, 13:05, 15:00, 16:00, 17:30, 18:30, 19:50,
20:50
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply