వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో
ఘనంగా సీతారాముల కళ్యాణం
హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీరామ నవమి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయం ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బుగ్గ లక్ష్మీపతి శర్మ వేద మంత్రాల ద్వారా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply