ఢిల్లీ, అద్దం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు జడ్జి మొట్టికాయలు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను సుందరం అనే న్యాయవాది సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు జస్టిస్ బీఆర్.గవాయ్ స్పందించారు. కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతాడు ? ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి ఎలా అంటాడు? ఇంతకూ ముందే ఇలా న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మళ్లీ మళ్లీ అలానే రిపీట్ చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డిపై జస్టిస్ బీఆర్.గవాయ్ సీరియస్ అయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply