అంబర్పేట్, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) : రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టడం జరిగిందని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో వి.హనుమంతరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రం, లేబర్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, టీపిసిసి ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…బీసీల లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని కోర్టులు చెప్పాయని, అందుకే బీసీ కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయబద్ధమైనదని వెంటనే పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply