SIR కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి
– బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటల రాజు
హైదరాబాద్, జూలై 15, ( అద్దం న్యూస్ ) : SIR కార్యక్రమాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటల రాజు కోరారు. బుధవారం ముషీరాబాద్లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గంటల రాజు మాట్లాడుతూ… ముషీరాబాద్లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ సాఫీగా జరుగుతుందని, బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం తరపున హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్యూమరేషన్ ప్రక్రియను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు కొండ శ్రీధర్రెడ్డి, శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply