హైదరాబాద్, జూన్ 7, అద్దం న్యూస్ : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. అర్థరాత్రి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడిన ఆగంతకుడు.. మేయర్తో పాటు ఆమె తండ్రి కేకే అంతు చూస్తానంటూ బెదిరించాడు. కాల్స్తో పాటు వాయిస్ మేసేజ్లు పెట్టి ఈ దుండగుడు బెదిరిస్తున్నాడు. బోరబండలో చనిపోయిన సర్దార్కి సంబంధించిన వ్యక్తినంటున్న ఆగంతకుడు ఫోన్లో చెప్పాడు. దీంతో మేయర్ పీఆర్వో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply