భారత వీర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని పూజలు
హైదరాబాద్, మే 10, అద్దం న్యూస్ : పాక్ దాడుల్లో మృతి చెందిన భారత జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాల్రాజ్గౌడ్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతీయ జెండాలతో ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డి.చంద్రమోహన్గౌడ్, ఉదయ్ కుమార్ గుప్త, సాగర్, రమేష్, సాయి, పుల్లయ్య, యాదగిరి, గోపాల్, జి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply